నల్గొండ టౌన్, న్యూస్టుడే: తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (టీఎంఎస్ఆర్యూ) ఆధ్వర్యంలో అల్ ఇండియా మెడికల్ షాపుల బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. All India Organisation of Chemists and Druggists (ఏఐఓసీడీ) పిలుపు మేరకు చేపట్టిన బంద్లో భాగంగా నల్గొండలో నాయకులు సమావేశమయ్యారు.
ఆన్లైన్లో మందుల విక్రయాలు, అధిక తగ్గింపు ధరల కారణంగా మెడికల్ షాపుల నిర్వాహకులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. దీంతో చిన్నస్థాయి మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఆన్లైన్లో మందుల కొనుగోలు ప్రజల ఆరోగ్యానికి పూర్తిగా శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్, నిరంజన్, పోలా రమేష్, జిల్లా కార్యదర్శి స్వామి, అధ్యక్షుడు హరిప్రసాద్, కోశాధికారి జీవన్, ఉప కార్యదర్శి నరేంద్ర, ఉపాధ్యక్షుడు అనిల్, కమిటీ సభ్యులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి