ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
రామన్నపేటలో శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమం
మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తూ ప్రజలందరూ శాంతి, సౌహార్ద వాతావరణంలో ఉగాది రంజాన్, శ్రీరామనవమి, పండుగలను జరుపుకోవాలని రామన్నపేట ఎస్ఐ నాగరాజు
సూచించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అపోహలకు, వదంతులకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ప్రార్థనలు, ఇఫ్తార్ కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
రంజాన్ పర్వదినం ద్వారా ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందించాలని, అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలని రక్షకబటులు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి