మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి
మాట నిలబెట్టుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి
Biksham
ఆలయ నిర్మాణానికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం
పాలేరు మాజీ శాసన సభ్యుడు కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కూసుమంచి మండలం లింగారంతండా గ్రామపంచాయతీ పరిధిలోని గన్యతండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి ఆలయాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు.
గతంలో తండా పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని ఇచ్చిన హామీ మేరకు యాభై వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, సహకార సంఘం మాజీ నిర్వాహకుడు ఇంటూరి శేఖర్, మల్లీడి వెంకన్న, సామాజిక మాధ్యమాల అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ, శేషగిరి, బారి మాల్సుర్, సైదు బాబు, మాజీ ఉప సర్పంచ్ గుగులోత్ బిక్కన రాందాస్, కిషన్ రామూర్తి, శ్రీను, మంగ్య, వీరన్న, మహేందర్, బాలాజీ, ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి