Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 25, 2026 10:11 PM

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా
February 25, 2026 08:40 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

10 వ వార్డు కౌన్సిలర్ దేప రమ్య రాజుకు ఘన సన్మానం

చౌటుప్పల్ పట్టణంలోని శ్రీరామ కూరగాయల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పురపాలక పదో వార్డు కౌన్సిలర్ దేప రమ్య రాజు ని ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పదో వార్డు నుంచి విజయం సాధించిన సందర్భంగా మార్కెట్ ప్రాంగణంలో సత్కార కార్యక్రమాన్నినిర్వహించారు. పూలదండలు, శాలువాతో కౌన్సిలర్‌ను సత్కరించిన కమిటీ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన దేప రమ్య రాజు, “శ్రీరామ కూరగాయల మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తాను. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాను. మౌలిక వసతుల మెరుగుదల, శుభ్రత, పారిశుధ్యం, డ్రైనేజీ, పార్కింగ్ వంటి అంశాలపై దశలవారీగా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులు దేప రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పిల్లలమర్రి జగదీష్, బొబ్బిళ్ళ కాళేశ్వర్, ప్రధాన కార్యదర్శి బాబు, కార్యదర్శి యాట రాజు, కోశాధికారి రషీద్, సాంస్కృతిక కార్యదర్శి పాశం వెంకటేశం, ప్రచార కార్యదర్శి కొడాలి దిలీప్, గౌరవ అధ్యక్షులు పిల్లలమర్రి యాదగిరి, గుండ్ల శంకరయ్య, నిమ్మల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News