Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం – రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు

మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం – రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు

మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం – రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు
March 11, 2026 09:58 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 16 వరకు కొనసాగనున్న ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు ఇప్పటికే ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. విద్యార్థుల హాల్‌టికెట్లు విడుదల చేయగా, మీ సేవ కేంద్రాల ద్వారా అలాగే 8096958096 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా కూడా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ పరీక్షల్లో రెగ్యులర్‌ విద్యార్థులు 5,17,727 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, గురుకులాల నుంచి 60,139 మంది, ప్రైవేట్‌ మరియు ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి 2,50,015 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు హాల్‌టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. మొబైల్‌ ఫోన్‌తో స్కాన్‌ చేస్తే పరీక్షా కేంద్రానికి వెళ్లే మార్గం మ్యాప్‌లో ఆటోమెటిక్‌గా కనిపించేలా ఏర్పాటు చేశారు.

విద్యార్థులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సూచించారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల ముందు తెరవాలని అధికారులు నిర్ణయించారు.పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలక మైలురాయిగా నిలుస్తాయని పాఠశాల విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. పాఠ్యాంశాలను బాగా చదివి అర్థం చేసుకుని రాస్తే అవి దీర్ఘకాలం గుర్తుంటాయని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News