PRINT TIME: June 10, 2026 02:12 PM
మానూర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం : ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
మానూర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం : ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
May 19, 2026 06:38 PM
62 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
హైదరాబాద్లో మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్లో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ ను మానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ రావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో వేసవి కారణంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్వెల్లు వేయించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ గౌడ్, శ్రీకాంత్, వెంకటరమణ, నితీష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి