Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:03 AM

మానవతా సేవా సారథి అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు నీలం శేఖర్

మానవతా సేవా సారథి అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు నీలం శేఖర్

మానవతా సేవా సారథి అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు నీలం శేఖర్
March 20, 2026 10:47 AM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: మండలంలోని ఎన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు నీలం శేఖర్ ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో భాగంగా మానవతా సేవా సారథి అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయుల్లో సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించడం విశేషం.

హైదరాబాద్ కళావేదిక ప్రాంగణంలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, గంగోత్రి కల్చరల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్, పారిజాత చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే నీలం శేఖర్ అనేక సామాజిక సంస్థలతో అనుసంధానమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకు ప్రేరణ కార్యక్రమాలు, ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మద్దతుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు, సినీ గాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తమ మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ఈ అవార్డు అందుకోవడం పట్ల ఎంఇఓ గవ్వ జ్యోతి, దొడ్డి స్వామి, శేఖర్, సురేందర్ రెడ్డి, బాసరాజు యాదగిరి, మట్టా రెడ్డి, తీగల జాన్ రెడ్డి, కమలాదేవి, భవాని, సీనా రెడ్డి, మణి, సైదులు, రవి కుమార్ స్వామి, మధుబాబు తదితరులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News