మానవతా సేవా సారథి అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు నీలం శేఖర్
మానవతా సేవా సారథి అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు నీలం శేఖర్
స్థానికం బృందం
రామన్నపేట,: మండలంలోని ఎన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు నీలం శేఖర్ ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో భాగంగా మానవతా సేవా సారథి అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయుల్లో సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించడం విశేషం.
హైదరాబాద్ కళావేదిక ప్రాంగణంలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, గంగోత్రి కల్చరల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్, పారిజాత చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే నీలం శేఖర్ అనేక సామాజిక సంస్థలతో అనుసంధానమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకు ప్రేరణ కార్యక్రమాలు, ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మద్దతుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు, సినీ గాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తమ మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ఈ అవార్డు అందుకోవడం పట్ల ఎంఇఓ గవ్వ జ్యోతి, దొడ్డి స్వామి, శేఖర్, సురేందర్ రెడ్డి, బాసరాజు యాదగిరి, మట్టా రెడ్డి, తీగల జాన్ రెడ్డి, కమలాదేవి, భవాని, సీనా రెడ్డి, మణి, సైదులు, రవి కుమార్ స్వామి, మధుబాబు తదితరులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి