Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

మానవసేవే మాధవసేవ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎస్సై శంకర్

మానవసేవే మాధవసేవ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎస్సై శంకర్

మానవసేవే మాధవసేవ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎస్సై శంకర్
January 23, 2026 06:30 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్

సేవే లక్ష్యంగా సామాజిక మాధ్యమమైన వాట్సాప్‌ను సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే ఆలోచనతో “మానవసేవే మాధవసేవ” పేరుతో 2016లో కుమ్మరి రాజు తన మిత్రుడు మహమ్మద్ రషీద్‌తో కలిసి వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్‌లోని తమ మిత్రులు, బంధువులను ఈ గ్రూపులో చేర్చుకొని, పేదలకు సహాయం, అవసరమైన వారికి తోడ్పాటు, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ వస్తున్నారు.

మానవసేవే మాధవసేవ గ్రూప్ ఏర్పాటుై పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, తాము ఈ దశాబ్ద కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా అనేక మంది యువకులకు ప్రేరణ కలగాలనే ఉద్దేశంతో 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ క్యాలెండర్‌ను కుమ్మరి రాజు తన బాల్యమిత్రుడు సాయిబాబా, గ్రూప్ సభ్యులు మహమ్మద్ రషీద్, డాక్టర్ సుధాకర్, జంగాల శ్రీరామ్, యాదవుల సహకారంతో సిద్ధం చేయించారు.శుక్రవారం సాయి నగర్‌లోని సాయిబాబా దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సై శంకర్ చేతుల మీదుగా, ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు మానవసేవే మాధవసేవ ప్రతినిధుల సమక్షంలో క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ, గ్రూప్ సభ్యులనుఅభినందించారు.ఈకార్యక్రమంలో ఎస్సై శంకర్, సాయిబాబా, మానవసేవే మాధవసేవ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, మహమ్మద్ రషీద్, ఉదారి సత్యనారాయణ యాదవ్, అనిత, సక్కురి భాస్కరరావు, రెడ్డిపల్లి శ్రీనివాస్, యాదగిరి,తో పాటు   సాయిబాబా ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు:కె. వెంకటేశం (సీనియర్ ట్రస్టీ),

పీ. ప్రభాకర్ (సీనియర్ ట్రస్టీ),ఎం. నాగ సతీష్ (ట్రస్టీ),బి. శ్రీనివాస్ శర్మ (మేనేజర్ – సాయి సమాజ్ చారిటబుల్ ట్రస్ట్) తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News