మానవసేవే మాధవసేవ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎస్సై శంకర్
మానవసేవే మాధవసేవ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎస్సై శంకర్
Prabhakar
స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్
సేవే లక్ష్యంగా సామాజిక మాధ్యమమైన వాట్సాప్ను సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే ఆలోచనతో “మానవసేవే మాధవసేవ” పేరుతో 2016లో కుమ్మరి రాజు తన మిత్రుడు మహమ్మద్ రషీద్తో కలిసి వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్లోని తమ మిత్రులు, బంధువులను ఈ గ్రూపులో చేర్చుకొని, పేదలకు సహాయం, అవసరమైన వారికి తోడ్పాటు, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ వస్తున్నారు.
మానవసేవే మాధవసేవ గ్రూప్ ఏర్పాటుై పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, తాము ఈ దశాబ్ద కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా అనేక మంది యువకులకు ప్రేరణ కలగాలనే ఉద్దేశంతో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించారు. ఈ క్యాలెండర్ను కుమ్మరి రాజు తన బాల్యమిత్రుడు సాయిబాబా, గ్రూప్ సభ్యులు మహమ్మద్ రషీద్, డాక్టర్ సుధాకర్, జంగాల శ్రీరామ్, యాదవుల సహకారంతో సిద్ధం చేయించారు.శుక్రవారం సాయి నగర్లోని సాయిబాబా దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సై శంకర్ చేతుల మీదుగా, ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు మానవసేవే మాధవసేవ ప్రతినిధుల సమక్షంలో క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ, గ్రూప్ సభ్యులనుఅభినందించారు.ఈకార్యక్రమంలో ఎస్సై శంకర్, సాయిబాబా, మానవసేవే మాధవసేవ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, మహమ్మద్ రషీద్, ఉదారి సత్యనారాయణ యాదవ్, అనిత, సక్కురి భాస్కరరావు, రెడ్డిపల్లి శ్రీనివాస్, యాదగిరి,తో పాటు సాయిబాబా ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు:కె. వెంకటేశం (సీనియర్ ట్రస్టీ),
పీ. ప్రభాకర్ (సీనియర్ ట్రస్టీ),ఎం. నాగ సతీష్ (ట్రస్టీ),బి. శ్రీనివాస్ శర్మ (మేనేజర్ – సాయి సమాజ్ చారిటబుల్ ట్రస్ట్) తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి