Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:14 PM

మానవసేవే మాధవసేవ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎస్సై శంకర్

మానవసేవే మాధవసేవ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎస్సై శంకర్

మానవసేవే మాధవసేవ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎస్సై శంకర్
January 23, 2026 06:30 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్

సేవే లక్ష్యంగా సామాజిక మాధ్యమమైన వాట్సాప్‌ను సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే ఆలోచనతో “మానవసేవే మాధవసేవ” పేరుతో 2016లో కుమ్మరి రాజు తన మిత్రుడు మహమ్మద్ రషీద్‌తో కలిసి వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్‌లోని తమ మిత్రులు, బంధువులను ఈ గ్రూపులో చేర్చుకొని, పేదలకు సహాయం, అవసరమైన వారికి తోడ్పాటు, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ వస్తున్నారు.

మానవసేవే మాధవసేవ గ్రూప్ ఏర్పాటుై పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, తాము ఈ దశాబ్ద కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా అనేక మంది యువకులకు ప్రేరణ కలగాలనే ఉద్దేశంతో 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ క్యాలెండర్‌ను కుమ్మరి రాజు తన బాల్యమిత్రుడు సాయిబాబా, గ్రూప్ సభ్యులు మహమ్మద్ రషీద్, డాక్టర్ సుధాకర్, జంగాల శ్రీరామ్, యాదవుల సహకారంతో సిద్ధం చేయించారు.శుక్రవారం సాయి నగర్‌లోని సాయిబాబా దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సై శంకర్ చేతుల మీదుగా, ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు మానవసేవే మాధవసేవ ప్రతినిధుల సమక్షంలో క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ, గ్రూప్ సభ్యులనుఅభినందించారు.ఈకార్యక్రమంలో ఎస్సై శంకర్, సాయిబాబా, మానవసేవే మాధవసేవ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, మహమ్మద్ రషీద్, ఉదారి సత్యనారాయణ యాదవ్, అనిత, సక్కురి భాస్కరరావు, రెడ్డిపల్లి శ్రీనివాస్, యాదగిరి,తో పాటు   సాయిబాబా ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు:కె. వెంకటేశం (సీనియర్ ట్రస్టీ),

పీ. ప్రభాకర్ (సీనియర్ ట్రస్టీ),ఎం. నాగ సతీష్ (ట్రస్టీ),బి. శ్రీనివాస్ శర్మ (మేనేజర్ – సాయి సమాజ్ చారిటబుల్ ట్రస్ట్) తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News