మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లితే కఠిన చర్యలు తప్పవు:కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి
మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లితే కఠిన చర్యలు తప్పవు:కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో స్థానిక సిఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం సిఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం , మయ మాటలు చెప్పి వెంట పడటం తర్వాత తీసుకెళ్లడం చేస్తున్నారు,ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా, ఎక్కడికన్నా తీసుకెళ్లినా, తీసుకెళ్లేందుకు ఎవరైనా సహకరించినా POCSO చట్టం కింద జీవితాంతం జైల్ లో ఉండాలిసి వస్తుంది,యువత ఇలాంటి జోలికి వెళ్లి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరుతున్నాం.తల్లి దండ్రులు మైనర్ పిల్లల పై ఒక కన్నేసి ఉంచాలి వాళ్లు ఏమి చేస్తున్నారు, ఫోన్స్ విషయం లో గానీ, ఛాటింగ్ విషయం లో గానీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి లేకుంటే చెడు వ్యసనాలకు బానిస అయి పక్క దారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని సిఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి