Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:48 PM

మన బడి మన బాధ్యత సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్

మన బడి మన బాధ్యత సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్

మన బడి మన బాధ్యత సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్
09-04-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

“మన బడి మన బాధ్యత సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్


రామన్నపేట స్థానికం ప్రతినిధి :



రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో

గ్రామ ప్రభుత్వ పాఠశాలను కాపాడి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “మన ఊరు – మన బడి” అనే నినాదంతో గ్రామస్తుల సహకారం కోరుతూ పాఠశాల అభివృద్ధికి పిలుపునిచ్చారు.

పాఠశాలను ఆకర్షణీయంగా మార్చేందుకు పెయింటింగ్, మహనీయుల చిత్రపటాలు, విద్యకు సంబంధించిన బొమ్మలు వేయించాలనే లక్ష్యంతో దాతలను ఆహ్వానిస్తున్నారు. చిత్రపటాలు వేయించిన దాతల పేర్లు వాటి కింద నమోదు చేయనున్నట్లు తెలిపారు.

గ్రామ ప్రజలు ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను చేర్పించి పాఠశాల అస్తిత్వాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు విద్యా వాలంటీర్లను నియమించనున్నట్లు, వారి వేతనాల కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.

పాఠశాల అభివృద్ధి కోసం సహకరించదలిచిన వారు వాట్సాప్ గ్రూప్ ద్వారా లేదా నేరుగా సర్పంచ్‌ను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

మన బడి మన బాధ్యత సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్

Article Image

“మన బడి మన బాధ్యత సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్


రామన్నపేట స్థానికం ప్రతినిధి :



రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో

గ్రామ ప్రభుత్వ పాఠశాలను కాపాడి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “మన ఊరు – మన బడి” అనే నినాదంతో గ్రామస్తుల సహకారం కోరుతూ పాఠశాల అభివృద్ధికి పిలుపునిచ్చారు.

పాఠశాలను ఆకర్షణీయంగా మార్చేందుకు పెయింటింగ్, మహనీయుల చిత్రపటాలు, విద్యకు సంబంధించిన బొమ్మలు వేయించాలనే లక్ష్యంతో దాతలను ఆహ్వానిస్తున్నారు. చిత్రపటాలు వేయించిన దాతల పేర్లు వాటి కింద నమోదు చేయనున్నట్లు తెలిపారు.

గ్రామ ప్రజలు ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను చేర్పించి పాఠశాల అస్తిత్వాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు విద్యా వాలంటీర్లను నియమించనున్నట్లు, వారి వేతనాల కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.

పాఠశాల అభివృద్ధి కోసం సహకరించదలిచిన వారు వాట్సాప్ గ్రూప్ ద్వారా లేదా నేరుగా సర్పంచ్‌ను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News