Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:44 AM

మల్కాజిగిరి పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు

మల్కాజిగిరి పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు

మల్కాజిగిరి పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు
January 30, 2026 08:41 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మల్కాజ్గిరి పోలీసులు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మౌలాలి ప్రాంతంలో ఉన్న రోటో మేకర్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగానికి చెందిన ఎస్‌.ఐ. శ్రీనివాస్, ఎస్‌.ఐ. ఉపేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రోడ్డు భద్రతకు సంబంధించిన కీలక అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.రోడ్డు పై వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని వారు వివరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై స్పష్టంగా అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడం వల్ల జరిగే ప్రమాదాలు కేవలం వ్యక్తిగత నష్టానికే కాకుండా, ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని అస్తవ్యస్తం చేసే పరిస్థితులకు దారి తీస్తాయని హెచ్చరించారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం సంభవిస్తే దాని ప్రభావం కుటుంబ సభ్యులపై ఎప్పటికీ ఉండిపోతుందని తెలిపారు.ప్రతి పౌరుడు రోడ్డు భద్రతను రోజువారీ బాధ్యతగా భావించి, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను నిత్యం పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అలాగే ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.ఈ అవగాహన సదస్సు ద్వారా ఉద్యోగుల్లో రోడ్డు భద్రతపై అవగాహన మరింత పెరిగిందని, భవిష్యత్తులో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తామని ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలనివారణకుదోహదపడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News