Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:46 PM

మల్కాజిగిరి పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు

మల్కాజిగిరి పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు

మల్కాజిగిరి పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు
January 30, 2026 08:41 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మల్కాజ్గిరి పోలీసులు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మౌలాలి ప్రాంతంలో ఉన్న రోటో మేకర్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగానికి చెందిన ఎస్‌.ఐ. శ్రీనివాస్, ఎస్‌.ఐ. ఉపేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రోడ్డు భద్రతకు సంబంధించిన కీలక అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.రోడ్డు పై వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని వారు వివరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై స్పష్టంగా అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడం వల్ల జరిగే ప్రమాదాలు కేవలం వ్యక్తిగత నష్టానికే కాకుండా, ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని అస్తవ్యస్తం చేసే పరిస్థితులకు దారి తీస్తాయని హెచ్చరించారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం సంభవిస్తే దాని ప్రభావం కుటుంబ సభ్యులపై ఎప్పటికీ ఉండిపోతుందని తెలిపారు.ప్రతి పౌరుడు రోడ్డు భద్రతను రోజువారీ బాధ్యతగా భావించి, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను నిత్యం పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అలాగే ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.ఈ అవగాహన సదస్సు ద్వారా ఉద్యోగుల్లో రోడ్డు భద్రతపై అవగాహన మరింత పెరిగిందని, భవిష్యత్తులో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తామని ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలనివారణకుదోహదపడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News