మల్కాజ్గిరి ఆస్తి సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం
మల్కాజ్గిరి ఆస్తి సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం
Editor Desk
మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఆస్తి సమస్యలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించారు.
నియోజకవర్గంలో సుమారు 384 ఎకరాల పరిధిలో ఉన్న 76 కాలనీలను వక్ఫ్ బోర్డు ఆస్తులుగా ప్రకటించి, 22-A కింద నిషేధిత జాబితాలో చేర్చడంతో సుమారు 18 వేల ఇళ్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
దీంతో బ్యాంకు రుణాలు పొందడం, ఇళ్లు అమ్మడం, మార్టిగేజ్ చేయడం, అదనపు అంతస్తులు నిర్మించడం వంటి కార్యకలాపాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం లేక ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని, అనుమతుల కోసం భారీ ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ భూములు నిజంగా వక్ఫ్ బోర్డు పరిధిలోకే వస్తాయా లేదా అన్నది ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆస్తి లావాదేవీలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశంపై స్పందించిన మంత్రివర్గం సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి