Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 20, 2026 02:11 PM

మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ కు దక్కినఅరుదైన గౌరవం అరుంధతి యూత్ యువజన సంఘ సభ్యులను హర్షం వ్యక్తం చేసిన...గ్రామస్తులు

మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ కు దక్కినఅరుదైన గౌరవం అరుంధతి యూత్ యువజన సంఘ సభ్యులను హర్షం వ్యక్తం చేసిన...గ్రామస్తులు

మాజీ  ఉప ప్రధాని  జగ్జీవన్ కు దక్కినఅరుదైన గౌరవం   అరుంధతి యూత్ యువజన సంఘ సభ్యులను హర్షం వ్యక్తం చేసిన...గ్రామస్తులు
March 18, 2026 07:22 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ ఎక్స్ రోడ్డు చౌరస్తాలో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు గత 17 సంవత్సరాల క్రితం అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం కింద జగ్జీవన్ రావు విగ్రహం ఉండడంతో వారికి అవమానం జరిగిందని గ్రామస్తులు కోరడం జరిగింది. అరుంధతి యువజన సంఘం సభ్యులు గ్రామ ప్రముఖులు గ్రామస్తులు సహకారంతో వారి సలహా సూచనలు తీసుకొని బుధవారం నాడు బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని గ్రామపంచాయతీ దగ్గర ఏర్పాటు చేశారు. గ్రామంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటుచేసిన అరుంధతి యువజన సంఘం సభ్యులను గ్రామస్తులుఅభినందించి హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా జగ్జీవన్ రావు విగ్రహాన్ని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అరుంధతి యూత్ సభ్యులు జీవన్ రావు విగ్రహానికి పాలాభిషేకం, మరియు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఉప ప్రధాని చేసిన సేవలను కొనియాడారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అరుంధతి యూత్ సభ్యులు పలువురు మాట్లాడుతూ...ఈనెల 21, 22, 23వ తేదీన గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహా ప్రతిష్ట మహోత్సవం, మరియు సంస్కృతికా కార్యక్రమాలు, మూడు జిల్లాల సాయి కబడ్డీ క్రీడలు జరుగుతుందని అన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అరుంధతి యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News