Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:09 PM

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
17-04-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


రమావత్ మధును అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం, మధు మరియు అతని బృందం దాదాపు రూ.150 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో పలు కేసులు నమోదు అయ్యాయి.

ఈ చీటింగ్ వ్యవహారంలో పాపులర్ గాయని తో పాటు ఆమె సోదరుడి పేర్లు కూడా వెలుగులోకి రావడం మరింత సంచలనంగా మారింది. అడ్వకేట్ సుబ్బారావు తదితరులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత చర్చనీయాంశమైంది.

కేసు బయటపడిన వెంటనే రమావత్ మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి, తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మధు అరెస్టుతో ఈ కేసులో ఉన్న అసలు నిజాలు బయటపడే అవకాశముందని, మోసానికి గురైన బాధితులకు న్యాయం జరిగే దిశగా విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Sthanikam

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Article Image


రమావత్ మధును అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం, మధు మరియు అతని బృందం దాదాపు రూ.150 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో పలు కేసులు నమోదు అయ్యాయి.

ఈ చీటింగ్ వ్యవహారంలో పాపులర్ గాయని తో పాటు ఆమె సోదరుడి పేర్లు కూడా వెలుగులోకి రావడం మరింత సంచలనంగా మారింది. అడ్వకేట్ సుబ్బారావు తదితరులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత చర్చనీయాంశమైంది.

కేసు బయటపడిన వెంటనే రమావత్ మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి, తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మధు అరెస్టుతో ఈ కేసులో ఉన్న అసలు నిజాలు బయటపడే అవకాశముందని, మోసానికి గురైన బాధితులకు న్యాయం జరిగే దిశగా విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News