మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
Biksham
రమావత్ మధును అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం, మధు మరియు అతని బృందం దాదాపు రూ.150 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో పలు కేసులు నమోదు అయ్యాయి.
ఈ చీటింగ్ వ్యవహారంలో పాపులర్ గాయని తో పాటు ఆమె సోదరుడి పేర్లు కూడా వెలుగులోకి రావడం మరింత సంచలనంగా మారింది. అడ్వకేట్ సుబ్బారావు తదితరులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత చర్చనీయాంశమైంది.
కేసు బయటపడిన వెంటనే రమావత్ మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి, తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మధు అరెస్టుతో ఈ కేసులో ఉన్న అసలు నిజాలు బయటపడే అవకాశముందని, మోసానికి గురైన బాధితులకు న్యాయం జరిగే దిశగా విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి