Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటర్‌లో స్టేట్ ర్యాంకులతో ఆదోని విద్యార్థినుల సత్తా నారా లోకేష్ స్ఫూర్తితో విద్యా రంగంలో ముందడుగు: దేవేంద్రప్ప బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 07:39 PM

మహిళలు, బాలికలకు భరోసాగా నిలుస్తున్న భరోసా సేవలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

మహిళలు, బాలికలకు భరోసాగా నిలుస్తున్న భరోసా సేవలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

మహిళలు, బాలికలకు భరోసాగా నిలుస్తున్న భరోసా సేవలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
May 07, 2026 06:33 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్., అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఐపీఎస్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్భయ ఘటన అనంతరం వర్మ కమిటీ సిఫార్సుల మేరకు పోక్సో, అత్యాచార కేసుల బాధిత మహిళలు, బాలికలకు ఒకే వేదికపై మెడికల్, లీగల్, కౌన్సిలింగ్, పరిహారం వంటి సేవలు అందించేందుకు 2016లో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారని తెలిపారు. గత పదేళ్లుగా భరోసా కేంద్రం బాధితులకు ఫిర్యాదు నమోదు నుంచి కోర్టు తీర్పు వచ్చే వరకు అండగా నిలుస్తూ సేవలు అందిస్తోందన్నారు. శిక్షణ పొందిన భరోసా సిబ్బంది బాధితుల్లో ధైర్యం నింపుతూ సత్వర న్యాయం అందేలా పనిచేస్తున్నారని కొనియాడారు.అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ పోక్సో, అత్యాచార కేసుల బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, సమాచారం అందిన వెంటనే భరోసా సిబ్బంది అన్ని సేవలు అందిస్తారని తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రం ఇప్పటివరకు 688 పోక్సో కేసులు, 85 అత్యాచార కేసులు, 162 కిడ్నాప్ కేసులు కలిపి మొత్తం 935 కేసుల్లో సేవలు అందించింది. అలాగే 175 అవగాహన కార్యక్రమాలు, 249 హోమ్ విజిట్స్, 531 వైద్య పరీక్షలు నిర్వహించగా, 468 మంది బాధితులకు రూ.1.83 కోట్లకు పైగా పరిహారం అందజేసింది. కార్యక్రమంలో డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, ఎస్ఐ పూలబాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News