మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; సర్పంచ్ చిలకల మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న
మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; సర్పంచ్ చిలకల మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న
Bandi Kiran Kumar
మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆదేశాల మేరకు 10 లక్షల వ్యయంతో శక్తి మహిళా సమైక్యభవనాన్ని శంకుస్థాపన చేసి మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వంఅనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, ఇలాంటి ఎన్నో స్త్రీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ విండో డైరెక్టర్ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ చందా వెంకన్న, మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, తాళ్లపల్లి యాకన్న, అంతేపరశురాం పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి