Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి సోమవారం ప్రజావాణి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహణ. కలెక్టర్ బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 08:27 PM

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ధ్యేయం: నిర్మల జగ్గారెడ్డి

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ధ్యేయం: నిర్మల జగ్గారెడ్డి

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ధ్యేయం: నిర్మల జగ్గారెడ్డి
May 02, 2026 06:51 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.195.18 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో జ్యోతి, ఆర్డీఓ రాజేందర్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్లు కూన వనిత, అంజమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, శివాజీతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News