మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ఎమ్మెల్యే వేముల వీరేశం
మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ఎమ్మెల్యే వేముల వీరేశం
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.
సోమవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి