Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:41 AM

మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ఎమ్మెల్యే వేముల వీరేశం

మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ఎమ్మెల్యే వేముల వీరేశం

మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ఎమ్మెల్యే వేముల వీరేశం
January 19, 2026 03:12 PM 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

సోమవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News