Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేపు ఘనంగా జరగనున్న ఊరడమ్మ, పాపమ్మ అమ్మవార్ల వార్షికోత్సవ బోనాలు 587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 09:34 PM

మహిళల భద్రతే లక్ష్యం – బోరంచలో షీ టీమ్ చైతన్య కార్యక్రమం

మహిళల భద్రతే లక్ష్యం – బోరంచలో షీ టీమ్ చైతన్య కార్యక్రమం

మహిళల భద్రతే లక్ష్యం – బోరంచలో షీ టీమ్ చైతన్య కార్యక్రమం
April 30, 2026 08:09 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామంలోని శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం ఆవరణలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్ మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్ బృందాలు నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. పితృస్వామ్య వ్యవస్థ, లింగ వివక్ష, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, బాలల రక్షణ చట్టాలు, మహిళల హక్కులు వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు సైబర్ మోసాలు, ఫేక్ అకౌంట్లు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఆన్‌లైన్ వేధింపులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సంగారెడ్డి షీ టీమ్ నంబర్ 8712656772ను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానూర్ పోలీస్ అధికారులు, షీ టీమ్ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, దేవస్థానం కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News