Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:10 PM

మహిళా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: కొప్పుల వేణారెడ్డి

మహిళా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: కొప్పుల వేణారెడ్డి

మహిళా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: కొప్పుల వేణారెడ్డి
02-06-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 11వ వార్డు రాయన్‌గూడెంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదల చిరకాల గృహ స్వప్నం నెరవేరుతోందని తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలు, పేదల సంక్షేమమే లక్ష్యంగా సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి మహిళ అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ ఏలుగూరి ఇందిరా–వీరయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీలు ఏలుగూరి వెంకటేశం, మేకరబోయిన శేఖర్, మాజీ సర్పంచ్ ముత్యాల సైదులు, మాజీ మూసి వైస్ చైర్మన్ కొప్పుల రాంరెడ్డి, చిత్తలూరు కృష్ణ, నంద్యాల బిక్షం రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, జంగిలి సైదులు, తంగెళ్ల రజనీకాంత్ రెడ్డి, ఎడ్ల ఉపేందర్, నంద్యాల వెంకటరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, నల్లమేకల సైదులు, షేక్ సొందు, దేవేందర్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ ఏలుగూరి వినోద్, ఉపాధ్యాయుడు యాకయ్య, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

మహిళా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: కొప్పుల వేణారెడ్డి

Article Image

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 11వ వార్డు రాయన్‌గూడెంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదల చిరకాల గృహ స్వప్నం నెరవేరుతోందని తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలు, పేదల సంక్షేమమే లక్ష్యంగా సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి మహిళ అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ ఏలుగూరి ఇందిరా–వీరయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీలు ఏలుగూరి వెంకటేశం, మేకరబోయిన శేఖర్, మాజీ సర్పంచ్ ముత్యాల సైదులు, మాజీ మూసి వైస్ చైర్మన్ కొప్పుల రాంరెడ్డి, చిత్తలూరు కృష్ణ, నంద్యాల బిక్షం రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, జంగిలి సైదులు, తంగెళ్ల రజనీకాంత్ రెడ్డి, ఎడ్ల ఉపేందర్, నంద్యాల వెంకటరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, నల్లమేకల సైదులు, షేక్ సొందు, దేవేందర్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ ఏలుగూరి వినోద్, ఉపాధ్యాయుడు యాకయ్య, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News