మహిళా దినోత్సవం సందర్భంగా డిపిఆర్ఓ అరుంధతికి టీయూడబ్ల్యూజే ఘన సత్కారం
మహిళా దినోత్సవం సందర్భంగా డిపిఆర్ఓ అరుంధతికి టీయూడబ్ల్యూజే ఘన సత్కారం
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిపిఆర్ఓ యు. అరుంధతిని బుధవారం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు ఆమెకు శాలువా కప్పి మెమొంటోను అందజేశారు. అనంతరం అరుంధతి మాట్లాడుతూ, మహిళా జిల్లా అధికారిణిగా తాను చేస్తున్న సేవలను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందని, ఈ సన్మానానికి టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు యంబి నరసింహులు, జిల్లా కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, ఐజేయు కౌన్సిల్ మెంబర్ జీవి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ వెలిమినేటి జహంగీర్, మాజీ జిల్లా అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి, యూనియన్ నాయకులు కందుకూరు సోమయ్య, పురుగుల మల్లేశం, గుండు ప్రసాద్, తాళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి