మాఘ తొలి సోమవారం శివనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణాలు
మాఘ తొలి సోమవారం శివనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణాలు
Biksham
బ్రహ్మసూత్రం ఉన్న రెండు శివాలయాల్లో తెల్లవారుజామునే రుద్రాభిషేకాలు
పంచామృతాలతో అభిషేకం… విశేష అలంకరణలో ఈశ్వరుడి దివ్య దర్శనం
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
మాఘ మాసం తొలి సోమవారం మహా పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మసూత్రం ఉన్న రెండు శివాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామునే ఆలయాలు తెరచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పంచామృతాలతో శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణతో మహాదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. పూలు, దీపాలతో శివాలయాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. రుద్రాభిషేకం అనంతరం విశేష అలంకరణలో ఈశ్వరుడి దివ్య దర్శనం భక్తులను అలరించింది. భక్తులు ఉపవాస దీక్షలు చేసి, వ్రతాలు ఆచరిస్తూ శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనాలు కొనసాగించారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై శివుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి