మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష
మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష
Biksham Goud
మరొ ఇద్దరికి జరిమానా
ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కఠిన తనిఖీలు – ట్రాఫిక్ ఎస్సై సాయిరాం
సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన నలుగురిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఇందులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, మరో ఇద్దరికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి గోపు రజిత తీర్పు ప్రకారం ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష, మరొకరికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున జరిమానా విధించారు. మరో ఇద్దరికి కలిపి మూడు వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై వెల్లడించారు.
జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. పోలీసులు నిర్వహించే వాహన తనిఖీలు ప్రజల ప్రాణ రక్షణ కోసమేనని, అందరూ చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని ఎస్సై సాయిరాం కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి