Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:07 PM

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష
26-02-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మరొ ఇద్దరికి జరిమానా

ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కఠిన తనిఖీలు – ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన నలుగురిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఇందులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, మరో ఇద్దరికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి గోపు రజిత తీర్పు ప్రకారం ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష, మరొకరికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున జరిమానా విధించారు. మరో ఇద్దరికి కలిపి మూడు వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై వెల్లడించారు.

జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. పోలీసులు నిర్వహించే వాహన తనిఖీలు ప్రజల ప్రాణ రక్షణ కోసమేనని, అందరూ చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని ఎస్సై సాయిరాం కోరారు.

Sthanikam

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష

Article Image

మరొ ఇద్దరికి జరిమానా

ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కఠిన తనిఖీలు – ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన నలుగురిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఇందులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, మరో ఇద్దరికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి గోపు రజిత తీర్పు ప్రకారం ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష, మరొకరికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున జరిమానా విధించారు. మరో ఇద్దరికి కలిపి మూడు వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై వెల్లడించారు.

జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. పోలీసులు నిర్వహించే వాహన తనిఖీలు ప్రజల ప్రాణ రక్షణ కోసమేనని, అందరూ చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని ఎస్సై సాయిరాం కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News