మద్వార్లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
మద్వార్లో క్రికెట్ సందడి.. టోర్నమెంట్ ప్రారంభించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
Krishna
నారాయణఖేడ్
మండలంలోని మద్వార్ గ్రామంలో పెద్దల ఆహ్వానం మేరకు నిర్వహించిన క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో పరిచయం చేసుకుని మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని సవాల్గా తీసుకుని మరింత ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం యువత ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, బుమన్నా ముదిరాజ్, సర్ధార్ రాథోడ్, రుక్మిణి హన్మండ్లు, బాబు నాయక్, రమేష్ రాథోడ్ సర్పంచ్లు, శివరాజ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, నారాయణ మాజీ ఎంపీటీసీ, నర్సింలు ఉపసర్పంచ్, రామగౌడ్, కృష్ణ, మారుతీ, సిద్దప్ప, మాచకూరి శంకర్ వార్డ్ సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి