Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:08 AM

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న దాబా నిర్వాహకుడు అరెస్టు

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న దాబా నిర్వాహకుడు అరెస్టు

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న దాబా నిర్వాహకుడు అరెస్టు
January 10, 2026 09:49 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

ఈగల్ టీం తో చాకచక్యంగా పట్టుకున్న చిట్యాల పోలీసులు

9 కిలోల ఓపియం, స్వాధీనం

చిట్యాల పట్టణ శివారులో ఉన్న ఒక దాబాలో ఓపియం మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకున్ని చిట్యాల పోలీసులు ఈగల్ టీం సహాయంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ డిఎస్పి కే శివరాం రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో జాతీయ రహదారి 65 పై ఉన్న డూన్ పంజాబీ దాబా లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ కు చెందిన దాబా యజమాని గుర్మీత్ సింగ్ గత కొంతకాలంగా నిషేధిత మాదకద్రవ్యమైన ఓపియం పాపి హస్క్ ఉందని దానిని దాబాలోని కస్టమర్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడని వచ్చిన సమాచారం తో చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి దాబాకు వెళ్లి యజమాని గుర్మీత్ సింగ్ నిషేధిత ఓపియం పాపి హస్క్ ను వాహనదారులకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు అని అనంతరం ఎస్సై మామిడి రవికుమార్ దాబా యజమానిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను జాతీయ రహదారిపై వెళుతున్న లారీ డ్రైవర్ల నుండి తాను ఓపియం పాపి హస్కును ఒక్క కిలో 1800 రూపాయలకు కొనుగోలు చేసి దానిని తిరిగి కిలో 6000 రూపాయలకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. కొద్దిరోజుల క్రితం 10 కిలోల ఓపియం పాపి హస్క్ కొనుగోలు చేసి అందులో సుమారు ఒక కిలో కస్టమర్లకు విక్రయించి మిగిలిన 9 కిలోల ఓపియం పాపి హస్కును డాబా లోని తన గదిలో దాచి పెట్టినట్లు తెలిపారు. దాబా యజమాని నుండి 54000 రూపాయల నగదు, 9 కిలోల ఓపియం పాపి హస్క్, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నల్గొండ డిఎస్పి కే శివరాంరెడ్డి పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ కే నాగరాజు ఆధ్వర్యంలో ఎస్సై ఎం రవికుమార్ మరియు స్టేషన్ సిబ్బంది లు చేసిన పనికి డిఎస్పి వారిని అభినందించారు..


* మారకద్రవ్యాలపై ఉక్కు పాదం : డి.ఎస్.పి శివరాం రెడ్డి


అక్రమ మాలికద్రవ్యాల ను సరఫరా చేసిన అమ్మిన వారి పైన వినియోగించిన వారిపై వదిలిపెట్టబోమని మారకద్రవ్యాలపై పోలీసు వ్యవస్థ ఉక్కు పాదంతో అంచివేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు .గంజాయి సరఫరా అమ్మే వ్యక్తులపైనే కాకుండా సేవించే వ్యక్తుల పైన కూడా చట్టపరమైన శిక్షలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాల ఎవరైనా విక్రయించిన సేవించిన 100 నెంబర్ కు గాని లేదా 8712670266 నెంబర్కు గాని సమాచారం అందించినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు..

ఈ సమావేశంలో నార్కెట్పల్లి సీఐ కే నాగరాజు, చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్, మునుగోడు ఎస్సై ఇరిగి రవి సిబ్బంది పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News