మడ్డువలస రిజర్వాయర్లో చేపలు పట్టుకునే హక్కుల బహిరంగ వేలం జారి, ఫిబ్రవరి 26వ తేదిన కోట్టిస గ్రామ సచివాలయం వద్ద నిర్వహన.
మడ్డువలస రిజర్వాయర్లో చేపలు పట్టుకునే హక్కుల బహిరంగ వేలం జారి, ఫిబ్రవరి 26వ తేదిన కోట్టిస గ్రామ సచివాలయం వద్ద నిర్వహన.
Sr.Journalist Y Vasu Naidu
మడ్డువలస రిజర్వాయర్లో చేపలు పట్టుకునే హక్కుల బహిరంగ వేలం జారి, ఫిబ్రవరి 26వ తేదిన కోట్టిస గ్రామ సచివాలయం వద్ద నిర్వహణ
- మత్స్య శాఖ సహాయ తనీఖీ దారు సిహెచ్.వి.వి.ప్రసాద్ రావు.
విజయనగరం/రాజాం, ఫిబ్రవరి 17: మత్స్య శాఖ ఏ.ఐ.ఎఫ్ (AIF) రాజాం పరిధిలోని గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువలస రిజర్వాయర్లో చేపలు పట్టుకునే హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మత్స్య శాఖ సహాయ తనిఖీదారు సి.హెచ్.వి.వి. ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. వేలం వంగర మండలం కొట్టిశ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఫిబ్రవరి 16వ తేదిన ఉదయం 11.30 గంటలకు బహిరంగ వేలం జరుగునని తెలిపారు. వేలంలో పాల్గొనదలిచిన వారు ముందుగా నిర్ణయించిన ధరావత్తు సొమ్ము (EMD) ₹ 18,21,817/- చెల్లించి పాల్గోన వచ్చునని తెలిపారు. అనుమతి కాలం 01-06-2025 నుండి 30-06-2026 వరకు (1435 ఫసలీ) వరకు ఉంటుందన్నారు. వేలం ముగియగానే అత్యధిక పాట పాడిన వారు (Highest Bidder) మొత్తం సొమ్మును వెంటనే చెల్లించవల్సి వుంటుందని, ఒకవేళ పాట పాడి సొమ్ము చెల్లించని యెడల, వారు చెల్లించిన ధరావత్తు సొమ్ము ప్రభుత్వానికి జప్తు చేయబడుతుందని తెలిపారు. జిల్లా మత్స్య శాఖ అధికారి అనుమతి పొందిన మూడు రోజులలోగా అగ్రిమెంట్ చేయించుకోవాలని, నీటి సరఫరాకు లేదా ఇరిగేషన్ వ్యవస్థకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని, ఎటువంటి కారణం చూపకుండా వేలాన్ని వాయిదా వేసే లేదా రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుందని నిబంధనలను ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత సమయానికి హాజరై వేలంలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి