Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:19 PM

మద్దిరాల మండలంలో రోడ్డు ప్రమాదం రికార్డు అసిస్టెంట్ మృతి

మద్దిరాల మండలంలో రోడ్డు ప్రమాదం రికార్డు అసిస్టెంట్ మృతి

మద్దిరాల మండలంలో రోడ్డు ప్రమాదం  రికార్డు అసిస్టెంట్ మృతి
January 21, 2026 11:50 AM 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యపేట జిల్లా మద్దిరాల మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తహసిల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మచ్చుకోరి రాజేష్ వయస్సు ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న అనంతరం నిత్యవసర సరుకుల కోసం బయటకు వెళ్లిన సమయంలో కుంటపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News