Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్

మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్

మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్
05-01-2026 491 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జహీరాబాద్ నుంచి ఖేడ్‌కు వెళ్తున్న సందర్భంగా ఎంపీ సురేష్ కూమార్ షెట్కార్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో బాదల్గాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దత్తు చెయ్యెత్తి ఆపడంతో ఆయన తన కాన్వాయ్‌ను వెంటనే నిలిపారు. కారు దిగి దత్తును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించి, అతని ఆరోగ్యం, జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి సవివరంగా తెలుసుకున్నారు.దత్తు తన సమస్యను వివరించగా,ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎంపీ స్పందన, ఆప్యాయతకు దత్తు భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశాడు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా సామాన్యుల కష్టాలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

Sthanikam

మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జహీరాబాద్ నుంచి ఖేడ్‌కు వెళ్తున్న సందర్భంగా ఎంపీ సురేష్ కూమార్ షెట్కార్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో బాదల్గాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దత్తు చెయ్యెత్తి ఆపడంతో ఆయన తన కాన్వాయ్‌ను వెంటనే నిలిపారు. కారు దిగి దత్తును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించి, అతని ఆరోగ్యం, జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి సవివరంగా తెలుసుకున్నారు.దత్తు తన సమస్యను వివరించగా,ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎంపీ స్పందన, ఆప్యాయతకు దత్తు భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశాడు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా సామాన్యుల కష్టాలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News