Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:11 AM

మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్

మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్

మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్
January 05, 2026 01:57 PM 487 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జహీరాబాద్ నుంచి ఖేడ్‌కు వెళ్తున్న సందర్భంగా ఎంపీ సురేష్ కూమార్ షెట్కార్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో బాదల్గాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దత్తు చెయ్యెత్తి ఆపడంతో ఆయన తన కాన్వాయ్‌ను వెంటనే నిలిపారు. కారు దిగి దత్తును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించి, అతని ఆరోగ్యం, జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి సవివరంగా తెలుసుకున్నారు.దత్తు తన సమస్యను వివరించగా,ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎంపీ స్పందన, ఆప్యాయతకు దత్తు భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశాడు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా సామాన్యుల కష్టాలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News