మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్
మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జహీరాబాద్ నుంచి ఖేడ్కు వెళ్తున్న సందర్భంగా ఎంపీ సురేష్ కూమార్ షెట్కార్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో బాదల్గాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దత్తు చెయ్యెత్తి ఆపడంతో ఆయన తన కాన్వాయ్ను వెంటనే నిలిపారు. కారు దిగి దత్తును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించి, అతని ఆరోగ్యం, జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి సవివరంగా తెలుసుకున్నారు.దత్తు తన సమస్యను వివరించగా,ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎంపీ స్పందన, ఆప్యాయతకు దత్తు భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశాడు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా సామాన్యుల కష్టాలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి