Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:23 AM

మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ మాతృమూర్తి మృతి – దుబ్బాకలో కాంగ్రెస్ నేతల పరామర్శ

మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ మాతృమూర్తి మృతి – దుబ్బాకలో కాంగ్రెస్ నేతల పరామర్శ

మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ మాతృమూర్తి మృతి – దుబ్బాకలో కాంగ్రెస్ నేతల పరామర్శ
December 29, 2025 11:28 AM 238 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ గౌడ్ మాతృమూర్తి గుండాల ఆండాలు మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ దుబ్బాక గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి సంతాపం తెలిపారు. ఆండాలు మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఇట్టే ఇంద్రారెడ్డి, గట్టు యాదయ్య, గుండాల సతీష్, ఉపసర్పంచ్ కోయగూర శ్రీను, యూత్ అధ్యక్షుడు మేడి సంతోష్, వార్డు మెంబర్లు గట్టు రాములమ్మ, సైదమ్మ, యాదమ్మతో పాటు గట్టు నరేందర్, కిరణ్, అశోక్, రామ్, వెంకటేష్, అంతిరెడ్డి పరశురాములు, శ్రీను, కృష్ణ, శాంతి తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని పలువురు నేతలు ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News