Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:34 PM

మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ మాతృమూర్తి మృతి – దుబ్బాకలో కాంగ్రెస్ నేతల పరామర్శ

మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ మాతృమూర్తి మృతి – దుబ్బాకలో కాంగ్రెస్ నేతల పరామర్శ

మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ మాతృమూర్తి మృతి – దుబ్బాకలో కాంగ్రెస్ నేతల పరామర్శ
December 29, 2025 11:28 AM 244 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ గౌడ్ మాతృమూర్తి గుండాల ఆండాలు మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ దుబ్బాక గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి సంతాపం తెలిపారు. ఆండాలు మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఇట్టే ఇంద్రారెడ్డి, గట్టు యాదయ్య, గుండాల సతీష్, ఉపసర్పంచ్ కోయగూర శ్రీను, యూత్ అధ్యక్షుడు మేడి సంతోష్, వార్డు మెంబర్లు గట్టు రాములమ్మ, సైదమ్మ, యాదమ్మతో పాటు గట్టు నరేందర్, కిరణ్, అశోక్, రామ్, వెంకటేష్, అంతిరెడ్డి పరశురాములు, శ్రీను, కృష్ణ, శాంతి తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని పలువురు నేతలు ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News