Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:22 AM

మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ మాతృమూర్తి మృతి – దుబ్బాకలో కాంగ్రెస్ నేతల పరామర్శ

మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ మాతృమూర్తి మృతి – దుబ్బాకలో కాంగ్రెస్ నేతల పరామర్శ

మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ మాతృమూర్తి మృతి – దుబ్బాకలో కాంగ్రెస్ నేతల పరామర్శ
December 29, 2025 11:28 AM 236 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ గౌడ్ మాతృమూర్తి గుండాల ఆండాలు మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ దుబ్బాక గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి సంతాపం తెలిపారు. ఆండాలు మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఇట్టే ఇంద్రారెడ్డి, గట్టు యాదయ్య, గుండాల సతీష్, ఉపసర్పంచ్ కోయగూర శ్రీను, యూత్ అధ్యక్షుడు మేడి సంతోష్, వార్డు మెంబర్లు గట్టు రాములమ్మ, సైదమ్మ, యాదమ్మతో పాటు గట్టు నరేందర్, కిరణ్, అశోక్, రామ్, వెంకటేష్, అంతిరెడ్డి పరశురాములు, శ్రీను, కృష్ణ, శాంతి తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని పలువురు నేతలు ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News