Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:00 PM

లోక్ అదాలత్‌తో వివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

లోక్ అదాలత్‌తో వివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

లోక్ అదాలత్‌తో వివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు
08-06-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు. క్షణికావేశంలో జరిగిన సంఘటనలు, చిన్నచిన్న వివాదాల కారణంగా నమోదైన కేసులను పరస్పర అవగాహనతో రాజీ ద్వారా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని ఆయన తెలిపారు. జిల్లాలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలు అంగీకారంతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా సమయం, ధనం, శ్రమ ఆదా కావడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి పోలీసు అధికారులు, సిబ్బంది రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వివాదాలకు ముగింపు పలికి సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలని జిల్లా ఎస్పీ కోరారు.

Sthanikam

లోక్ అదాలత్‌తో వివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

Article Image

ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు. క్షణికావేశంలో జరిగిన సంఘటనలు, చిన్నచిన్న వివాదాల కారణంగా నమోదైన కేసులను పరస్పర అవగాహనతో రాజీ ద్వారా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని ఆయన తెలిపారు. జిల్లాలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలు అంగీకారంతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా సమయం, ధనం, శ్రమ ఆదా కావడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి పోలీసు అధికారులు, సిబ్బంది రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వివాదాలకు ముగింపు పలికి సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలని జిల్లా ఎస్పీ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News