లోక్ అదాలత్తో కేసుల పరిష్కారం సులువు: ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్
లోక్ అదాలత్తో కేసుల పరిష్కారం సులువు: ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్
Editor Desk
రంగారెడ్డి,
కేసుల త్వరిత పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గమని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ కర్ణ కుమార్ తెలిపారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో చెల్లించిన కోర్టు ఫీజులు తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆస్తి, కుటుంబ వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో రాజీ కుదిరితే ఇరు పక్షాలూ గెలిచినట్లేనని అన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. అనూష మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 22 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, వినియోగదారుల కోర్టు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. లోక్ అదాలత్ నిర్వహణలో పోలీసు, ఇన్సూరెన్స్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్యానెల్ అడ్వొకేట్లు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది సహకరించారని చెప్పారు. కక్షిదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేశారు.
ఈ జాతీయ లోక్ అదాలత్లో సుమారు 1.20 లక్షల పైచిలుకు కేసులు పరిష్కరించగా, రూ.8,32,49,040 వరకు నష్టపరిహారం కక్షిదారులకు అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి