Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:57 AM

లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవం సందర్భంగా ఖేడ్ బసవ కూడలిలో జెండా ఆవిష్కరణ

లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవం సందర్భంగా ఖేడ్ బసవ కూడలిలో జెండా ఆవిష్కరణ

లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవం సందర్భంగా ఖేడ్ బసవ కూడలిలో జెండా ఆవిష్కరణ
January 16, 2026 12:41 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఖేడ్ బసవ కూడలిలో లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర లింగయ్యత్ సంఘ గౌరవ అధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వరులు పన్నెండవ శతాబ్దానికి చెందిన గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి మరియు లింగయ్యత్ ధర్మ స్థాపకులలో అగ్రగణ్యులని అన్నారు. కుల వివక్ష, మూఢాచారాలు, అంధ విశ్వాసాలను తీవ్రంగా వ్యతిరేకించి, సమాజంలో సమానత్వం, మానవ గౌరవం, న్యాయం నెలకొల్పేందుకు ఆయన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.‘కాయకవే కైలాస’ అనే మహత్తర సిద్ధాంతంతో శ్రమకు దైవసమానమైన గౌరవాన్ని కల్పించిన మహానీయుడు బసవేశ్వరులని తెలిపారు. క్రీ.శ. 1131 సంవత్సరంలో కర్ణాటక ప్రాంతంలోని బసవన బాగేవాడిలో జన్మించిన ఆయన, ప్రజాసేవనే పరమావధిగా భావించి మంత్రిగా, తత్వవేత్తగా సామాజిక సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారని వివరించారు.ప్రతి వ్యక్తి తనలోని శివభక్తిని ప్రతిబింబించేలా ఇష్టలింగం ధరించాలని బోధించిన మహాత్మా బసవేశ్వరులు, అనుభవ మంటపం ద్వారా పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ సామాజిక, ఆధ్యాత్మిక చర్చలకు వేదిక ఏర్పాటు చేశారని అన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడిన మహోన్నత సంస్కరణవాది బసవేశ్వరులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లింగయ్యత్ సంఘ నాయకులు, భక్తులు, మహిళలు, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News