Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 01:18 AM

లింగవారిగూడెం లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేసిన సర్పంచ్

లింగవారిగూడెం లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేసిన సర్పంచ్

లింగవారిగూడెం లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేసిన సర్పంచ్
February 25, 2026 11:36 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

కత్తుల జ్యోతి వాసు బాబు

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారి గూడెం గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొరకు సర్పంచ్ కత్తుల జ్యోతి వాసు బాబు శంకుస్థాపన చేశారు ఖమ్మం ఎంపీ రాజ్యసభ వద్దిరాజు రవిచంద్ర నిధుల నుండి ఏడు లక్షల 50 వేల రూపాయలు మంజూరు కావడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ నిధులు మంజూరు చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు గ్రామ అభివృద్ధి కొరకు ప్రభుత్వం నుండి నిధులను తీసుకొఛ్చి అభివృద్ధి చేస్తానని తెలియజేశారు ఇప్పటివరకు గ్రామంలో వీధిలైట్లు వీధులలో మట్టి శానిటేషన్ వంటి పరిశుభ్రమైన కార్యక్రమాలు నిర్వహించామని ఇకనుండి గ్రామంలోని ప్రజలకి, గ్రామానికి ఏ లోటు రాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని దీనికి గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె లింగారెడ్డి, వార్డు మెంబర్లు కత్తుల మల్లయ్య, పల్లె ప్రేమలత, కత్తుల సాయిలు, కత్తుల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తుల లక్ష్మయ్య, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కత్తుల గాలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కత్తుల అశోక్, దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ కత్తుల నరసింహ, దేవాలయ కమిటీ కార్యదర్శి బద్ధుల దయాకర్, సుర్కంటి నరసింహారెడ్డి, కురుమతి యాదయ్య, ఉప్పరగొని శేఖర్, కుక్కల వెంకయ్య, కాంట్రాక్టర్ లాలయ్య గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News