Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:41 AM

లారీలోకి ధాన్యం బస్తాలను ఎగుమతి చేపించిన; జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్

లారీలోకి ధాన్యం బస్తాలను ఎగుమతి చేపించిన; జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్

లారీలోకి ధాన్యం బస్తాలను ఎగుమతి చేపించిన;   జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్
May 19, 2026 07:56 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar



ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు బస్తాలో కాంటా పెట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపిణీ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తప్పమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో పాటు, పలు ఐకెపి ధాన్యం కేంద్రాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.


సూర్య తండ మాజీ సర్పంచ్ నాకావత్ యాకో నాయక్ తమ గ్రామంలో బస్తాల్లో కాంటా పెట్టి ఉండమని లారీ లేక ధాన్యం సర్కు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధింత అధికారులతో మాట్లాడి లారీలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు పంపిన ధాన్యాన్ని, మిల్లర్లు యాజమాన్యం ఇస్తారాజ్యంగా కటింగ్ చేస్తే చర్యలు తప్పవు అన్నారు.


స్టేడియంలో నిలువ ఉన్న ధాన్యపు బస్తాలను లారీ పిలిపించి తక్షణమే బస్తాలను దగ్గర ఉండి ఎగుమతి నీ కలెక్టర్ చేయించారు. దీనితో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, వేసవి తాపంతో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, లారీలు తెప్పించి ఎగుమతి చేయాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఉన్నతాధికారులు, మండల అధికారులు తాసిల్దార్ దయానందం, ఏ డి ఏ రమేష్ బాబు, ఎంపీడీవో శేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News