Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:47 PM

లారీలోకి ధాన్యం బస్తాలను ఎగుమతి చేపించిన; జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్

లారీలోకి ధాన్యం బస్తాలను ఎగుమతి చేపించిన; జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్

లారీలోకి ధాన్యం బస్తాలను ఎగుమతి చేపించిన;   జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్
May 19, 2026 07:56 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar



ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు బస్తాలో కాంటా పెట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపిణీ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తప్పమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో పాటు, పలు ఐకెపి ధాన్యం కేంద్రాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.


సూర్య తండ మాజీ సర్పంచ్ నాకావత్ యాకో నాయక్ తమ గ్రామంలో బస్తాల్లో కాంటా పెట్టి ఉండమని లారీ లేక ధాన్యం సర్కు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధింత అధికారులతో మాట్లాడి లారీలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు పంపిన ధాన్యాన్ని, మిల్లర్లు యాజమాన్యం ఇస్తారాజ్యంగా కటింగ్ చేస్తే చర్యలు తప్పవు అన్నారు.


స్టేడియంలో నిలువ ఉన్న ధాన్యపు బస్తాలను లారీ పిలిపించి తక్షణమే బస్తాలను దగ్గర ఉండి ఎగుమతి నీ కలెక్టర్ చేయించారు. దీనితో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, వేసవి తాపంతో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, లారీలు తెప్పించి ఎగుమతి చేయాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఉన్నతాధికారులు, మండల అధికారులు తాసిల్దార్ దయానందం, ఏ డి ఏ రమేష్ బాబు, ఎంపీడీవో శేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News