లక్ష్య సాధనకు విద్యార్థులు కష్టపడాలి : ఎస్పీ పరితోష్ పంకజ్
లక్ష్య సాధనకు విద్యార్థులు కష్టపడాలి : ఎస్పీ పరితోష్ పంకజ్
Krishna
పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యలో, పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “స్పార్క్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డితో కలిసి ఖాకీ కిడ్స్కు భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, విద్య ప్రాముఖ్యత, లక్ష్య సాధన, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై పలు సూచనలు చేశారు. చిన్నప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివితే విజయాన్ని సులభంగా సాధించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను మంచికి వినియోగించుకొని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, గత సంవత్సరాల మోడల్ పేపర్లు పరిశీలించడం, ప్రతిరోజూ న్యూస్ పేపర్ చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.ఖాకీ కిడ్స్కు మరింత ప్రోత్సాహం అందించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక స్టడీ హాల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసు సిబ్బంది తమ విధులతో పాటు కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పిల్లల విద్యాభివృద్ధికి అండగా నిలవాలని సూచించారు. అర్హత కలిగిన సిబ్బంది కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే “స్పార్క్” కార్యక్రమాన్ని ఖాకీ కిడ్స్ సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసు సిబ్బంది, ఖాకీ కిడ్స్ మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి