లైసెన్స్ లేని టిప్పర్ డ్రైవర్లతో ప్రాణసంకటం
లైసెన్స్ లేని టిప్పర్ డ్రైవర్లతో ప్రాణసంకటం
Biksham
సూర్యాపేట పట్టణంలో శాంతినగర్, విజయకాలనీ, హనుమాన్నగర్ ప్రాంతాల్లో టిప్పర్ల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శాంతినగర్ సర్వీస్ రోడ్, జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం రోడ్డుమీదుగా రోజుకు 30–40 ట్రిప్పులు టిప్పర్లు తిరుగుతున్నాయి. వీటి వల్ల రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు దుమ్ముతో కలుషితమవుతున్నాయి.
ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, టిప్పర్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతూ వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు టిప్పర్కు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బాధితులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గురువారం శాంతినగర్ అండర్పాస్ సమీపంలో జరిగిన ఘటనలో, నిర్లక్ష్యంగా నడిపిన టిప్పర్ బైక్ను ఢీకొట్టే పరిస్థితి ఏర్పడింది. స్థానికులు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని తెలిపారు. అనంతరం టిప్పర్కు చెందిన వారు డ్రైవర్ను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
ఈ మార్గంలో టిప్పర్ల రాకపోకలను నియంత్రించాలని, ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్ల ద్వారా మట్టి, ఇసుక రవాణా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి