Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:09 PM

లైసెన్స్ లేని టిప్పర్ డ్రైవర్లతో ప్రాణసంకటం

లైసెన్స్ లేని టిప్పర్ డ్రైవర్లతో ప్రాణసంకటం

లైసెన్స్ లేని టిప్పర్ డ్రైవర్లతో ప్రాణసంకటం
23-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


సూర్యాపేట పట్టణంలో శాంతినగర్, విజయకాలనీ, హనుమాన్‌నగర్ ప్రాంతాల్లో టిప్పర్ల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాంతినగర్ సర్వీస్ రోడ్, జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం రోడ్డుమీదుగా రోజుకు 30–40 ట్రిప్పులు టిప్పర్లు తిరుగుతున్నాయి. వీటి వల్ల రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు దుమ్ముతో కలుషితమవుతున్నాయి.

ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, టిప్పర్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతూ వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు టిప్పర్‌కు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బాధితులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గురువారం శాంతినగర్ అండర్‌పాస్ సమీపంలో జరిగిన ఘటనలో, నిర్లక్ష్యంగా నడిపిన టిప్పర్ బైక్‌ను ఢీకొట్టే పరిస్థితి ఏర్పడింది. స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని తెలిపారు. అనంతరం టిప్పర్‌కు చెందిన వారు డ్రైవర్‌ను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

ఈ మార్గంలో టిప్పర్ల రాకపోకలను నియంత్రించాలని, ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్ల ద్వారా మట్టి, ఇసుక రవాణా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

లైసెన్స్ లేని టిప్పర్ డ్రైవర్లతో ప్రాణసంకటం

Article Image


సూర్యాపేట పట్టణంలో శాంతినగర్, విజయకాలనీ, హనుమాన్‌నగర్ ప్రాంతాల్లో టిప్పర్ల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాంతినగర్ సర్వీస్ రోడ్, జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం రోడ్డుమీదుగా రోజుకు 30–40 ట్రిప్పులు టిప్పర్లు తిరుగుతున్నాయి. వీటి వల్ల రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు దుమ్ముతో కలుషితమవుతున్నాయి.

ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, టిప్పర్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతూ వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు టిప్పర్‌కు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బాధితులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గురువారం శాంతినగర్ అండర్‌పాస్ సమీపంలో జరిగిన ఘటనలో, నిర్లక్ష్యంగా నడిపిన టిప్పర్ బైక్‌ను ఢీకొట్టే పరిస్థితి ఏర్పడింది. స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని తెలిపారు. అనంతరం టిప్పర్‌కు చెందిన వారు డ్రైవర్‌ను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

ఈ మార్గంలో టిప్పర్ల రాకపోకలను నియంత్రించాలని, ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్ల ద్వారా మట్టి, ఇసుక రవాణా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News