Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:48 PM

కుంటముక్కలలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీ ఘనంగా ప్రారంభం

కుంటముక్కలలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీ ఘనంగా ప్రారంభం

కుంటముక్కలలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీ ఘనంగా ప్రారంభం
March 30, 2026 05:04 AM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఘనంగా ప్రారంభించారు. గ్రామంలో అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా స్వాగతం పలికారు.

వివిధ పాల ఉత్పత్తులను ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన ఆధునిక ప్లాస్టిక్ కంటైనర్లను ఈ ఫ్యాక్టరీలో తయారు చేయనుండటంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అభినందిస్తూ, పరిశ్రమ విజయవంతంగా అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News