Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:12 PM

కుంటముక్కలలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీ ఘనంగా ప్రారంభం

కుంటముక్కలలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీ ఘనంగా ప్రారంభం

కుంటముక్కలలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీ ఘనంగా ప్రారంభం
March 30, 2026 05:04 AM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఘనంగా ప్రారంభించారు. గ్రామంలో అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా స్వాగతం పలికారు.

వివిధ పాల ఉత్పత్తులను ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన ఆధునిక ప్లాస్టిక్ కంటైనర్లను ఈ ఫ్యాక్టరీలో తయారు చేయనుండటంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అభినందిస్తూ, పరిశ్రమ విజయవంతంగా అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News