PRINT TIME: May 27, 2026 04:12 AM
కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం
కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం
March 17, 2026 06:50 PM
50 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
Kusumanchiలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలేరు క్లస్టర్కు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రమ్మడుగు వాణి , రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి శరత్ బాబు , ఆలేరు డివిజన్ ఉద్యాన అధికారి అపర్ణ , కూసుమంచి డివిజన్ టెక్నికల్ ఏవో అరుణ పాల్గొన్నారు.
వారు రైతులకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయాలు తయారీ విధానాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మట్టిసారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.
అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబాయ్ , ప్రియాంక మరియు రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి