Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:19 PM

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం

కూసుమంచి రైతు వేదికలో ‘రైతు నేస్తం
March 17, 2026 06:50 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

Kusumanchiలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలేరు క్లస్టర్‌కు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రమ్మడుగు వాణి , రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి శరత్ బాబు , ఆలేరు డివిజన్ ఉద్యాన అధికారి అపర్ణ , కూసుమంచి డివిజన్ టెక్నికల్ ఏవో అరుణ పాల్గొన్నారు.

వారు రైతులకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయాలు తయారీ విధానాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మట్టిసారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.

అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబాయ్ , ప్రియాంక మరియు రైతులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News