కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఘనంగా
కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఘనంగా
Biksham
సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కట్టుబాటు
కూసుమంచి: భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత వంటి ఆశయాలు సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇంచార్జ్ భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు కొండ కృష్ణవేణి మహిపాల్, వడిత్య వెంకటేష్ నాయక్, హాలావత్ వీరియా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హఫీజ్, ఉపాధ్యక్షుడు మంకెన వాసు, సభ్యుడు బానోత్ వినోద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి