Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:29 PM

కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఘనంగా
April 14, 2026 04:23 PM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కట్టుబాటు

కూసుమంచి: భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత వంటి ఆశయాలు సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇంచార్జ్ భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు కొండ కృష్ణవేణి మహిపాల్, వడిత్య వెంకటేష్ నాయక్, హాలావత్ వీరియా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హఫీజ్, ఉపాధ్యక్షుడు మంకెన వాసు, సభ్యుడు బానోత్ వినోద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News