Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 08:18 PM

కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఘనంగా
April 14, 2026 04:23 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కట్టుబాటు

కూసుమంచి: భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కూసుమంచి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత వంటి ఆశయాలు సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇంచార్జ్ భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు కొండ కృష్ణవేణి మహిపాల్, వడిత్య వెంకటేష్ నాయక్, హాలావత్ వీరియా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హఫీజ్, ఉపాధ్యక్షుడు మంకెన వాసు, సభ్యుడు బానోత్ వినోద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News