Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:43 PM

కూరెళ్ల విఠలాచార్య సాహిత్యంపై సమాలోచన రామన్నపేట కళాశాలలో పుస్తక సమీక్ష

కూరెళ్ల విఠలాచార్య సాహిత్యంపై సమాలోచన రామన్నపేట కళాశాలలో పుస్తక సమీక్ష

కూరెళ్ల విఠలాచార్య సాహిత్యంపై సమాలోచన  రామన్నపేట కళాశాలలో పుస్తక సమీక్ష
March 24, 2026 03:14 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన “డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య సాహిత్యం–సమాలోచనం” పుస్తక సమీక్షా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గొప్ప సాహితీవేత్తగా నిలిచారని అన్నారు. తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి సమాజానికి విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. మహాకవి దాశరథి పురస్కారంతో పాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. అటువంటి మహనీయుడి సాహిత్యంపై జాతీయ సదస్సు నిర్వహించి, పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమన్నారు.

పుస్తక సంపాదకులు, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ జాతీయ సదస్సులో పాల్గొన్న 31 మంది ఆచార్యులు, పరిశోధక విద్యార్థుల వ్యాసాలను సమగ్రంగా సేకరించి పుస్తక రూపంలో తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని “మూసీ” ప్రత్యేక సంచికగా వెలువరించిన నిర్వాహకులు ఆచార్య సాగి కమలాకర్ శర్మకు, ప్రచురణకు సహకరించిన కూరెళ్ల ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News