Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

కుమ్మేరలో కుల దురహంకార హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి.

కుమ్మేరలో కుల దురహంకార హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి.

కుమ్మేరలో కుల దురహంకార హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి.
March 09, 2026 08:33 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సిఐటియు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,కల్లూరి మల్లేశం

నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దళిత,రజక కుటుంబ వ్యక్తులను కులం పేరుతో దూషించి,రెండు నెలల పసికూనను కాళ్ళతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రా రెడ్డి, కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరలో జరిగిన ఘటనపై సిఐటియు రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుమ్మరెలో జరిగిన మల్లన్న జాతరలో దైవదర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి చెందిన గణేష్ మౌనిక దంపతులను ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డి ఇతరులు అడ్డుకొని ఘర్షణకు దిగి గణేష్ పై దాడి చేసి రెండు నెలల చిన్న పాపను కాళ్లతో తన్ని శిశువుని హత్య చేసిన దుండగులపై నేటికీ హత్యానేరం కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిగా బాధితులపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాపిత పోరాటాల ఫలితంగా కేవలం బిఎన్ఎస్ 194 సెక్షన్ నమోదు చేయడం అంటే హంతకులను కాపాడటమే నన్నారు.

కులదురహంకర హత్యలకు పాల్పడిన వారిని కటినంగా శిక్షించాలని లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,మాయ కృష్ణ,సిఐటియు పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య,సిఐటియు జిల్లా కమిటి సభ్యులు పోతరాజు జహంగీర్,నాయకులు గడ్డమీది నరసింహ,శ్రవణ్,నాగలక్ష్మి,సుజాత,కె.సంధ్య,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News