Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 03:10 AM

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ

కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ
February 27, 2026 01:57 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డెమోక్రటిక్యూ త్ఫె డరేషన్అ ఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు నకిరేకల్ బస్టాండ్ సెంటర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోనూ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. రెండు నెలల పసిపాప మృతి చెందడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతరకు వెళ్లిన మహిళను తక్కువ కులానికి చెందినదని పేర్కొంటూ దేవాలయ దర్శనానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని తెలిపారు. ఘటనలో చిన్నారి మృతి చెందడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News