కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ
కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై నిరసన నిందితుల అరెస్టు డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ
స్థానికం బృందం
నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డెమోక్రటిక్యూ త్ఫె డరేషన్అ ఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు నకిరేకల్ బస్టాండ్ సెంటర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోనూ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. రెండు నెలల పసిపాప మృతి చెందడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతరకు వెళ్లిన మహిళను తక్కువ కులానికి చెందినదని పేర్కొంటూ దేవాలయ దర్శనానికి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని తెలిపారు. ఘటనలో చిన్నారి మృతి చెందడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి