కులవ్యవస్థ నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే
కులవ్యవస్థ నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే
Biksham
పూలే 199వ జయంతి సందర్భంగా ఘన నివాళులు – మేకల మల్లిబాబు యాదవ్
కామేపల్లి: కులవ్యవస్థ నిర్మూలనకు, అణగారిన వర్గాల హక్కుల సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు, సహకార బ్యాంకు నిర్వాహక మండలి సభ్యుడు మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు.శనివారం కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే సామాజిక అసమానతలను గమనించి కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధుడు పూలే అని అన్నారు. అణగారిన వర్గాలను చదువుకు దూరం చేసి, బానిసలుగా మలిచిన పరిస్థితులను ఎదుర్కొని సమానత్వం కోసం పోరాటం సాగించారని తెలిపారు.
స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇచ్చి తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి పాఠశాలలను స్థాపించి మహిళల అభ్యున్నతికి మార్గం సుగమం చేశారని అన్నారు. అలాగే సత్యశోధక సమాజాన్ని స్థాపించి, రచనల ద్వారా కులవివక్ష నిర్మూలనకు కృషి చేశారని వివరించారు.ప్రస్తుతం పరిస్థితులు మారినప్పటికీ ఇంకా కుల వివక్ష పూర్తిగా తొలగలేదని, పూలే స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేకల మల్లికార్జునరావు, ధరావత్ లాలు నాయక్, శీలం పుల్లయ్య, షేక్ అక్బర్, మేకల లక్ష్మీనారాయణ, బాదావత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి