Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:32 PM

కులవ్యవస్థ నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే

కులవ్యవస్థ నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే

కులవ్యవస్థ నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే
April 11, 2026 04:29 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పూలే 199వ జయంతి సందర్భంగా ఘన నివాళులు – మేకల మల్లిబాబు యాదవ్

కామేపల్లి: కులవ్యవస్థ నిర్మూలనకు, అణగారిన వర్గాల హక్కుల సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు, సహకార బ్యాంకు నిర్వాహక మండలి సభ్యుడు మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు.శనివారం కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే సామాజిక అసమానతలను గమనించి కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధుడు పూలే అని అన్నారు. అణగారిన వర్గాలను చదువుకు దూరం చేసి, బానిసలుగా మలిచిన పరిస్థితులను ఎదుర్కొని సమానత్వం కోసం పోరాటం సాగించారని తెలిపారు.

స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇచ్చి తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి పాఠశాలలను స్థాపించి మహిళల అభ్యున్నతికి మార్గం సుగమం చేశారని అన్నారు. అలాగే సత్యశోధక సమాజాన్ని స్థాపించి, రచనల ద్వారా కులవివక్ష నిర్మూలనకు కృషి చేశారని వివరించారు.ప్రస్తుతం పరిస్థితులు మారినప్పటికీ ఇంకా కుల వివక్ష పూర్తిగా తొలగలేదని, పూలే స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేకల మల్లికార్జునరావు, ధరావత్ లాలు నాయక్, శీలం పుల్లయ్య, షేక్ అక్బర్, మేకల లక్ష్మీనారాయణ, బాదావత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News