Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 19, 2026 06:23 PM

కృత్రిమ పానీయాలకు గుడ్‌బై.. సహజానికి గ్రీన్ సిగ్నల్..! జిల్లా కలెక్టర్

కృత్రిమ పానీయాలకు గుడ్‌బై.. సహజానికి గ్రీన్ సిగ్నల్..! జిల్లా కలెక్టర్

కృత్రిమ పానీయాలకు గుడ్‌బై.. సహజానికి గ్రీన్ సిగ్నల్..! జిల్లా కలెక్టర్
March 19, 2026 04:59 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఉగాది పచ్చడి వితరణతో అవగాహన

నల్గొండ: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కృత్రిమ పానీయాలను మానేసి సహజ పానీయాలను సేవించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటీఎఫ్) నల్లగొండ జిల్లా మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గడియారం సెంటర్ వద్ద నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృత్రిమ పానీయాల వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయని, ప్రకృతిలో లభించే సహజ పానీయాలే ఆరోగ్యానికి మేలని సూచించారు.

నల్లగొండ తొలి మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాలానుగుణంగా శరీరానికి అవసరమైన పోషకాలు అందించే సహజ పానీయాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

టీఎస్ యుటీఎఫ్ నేతలు మాట్లాడుతూ సమాజంలో కృత్రిమ పానీయాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. యువత శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించి కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం వంటి సహజ పానీయాల వైపు మొగ్గుచూపాలని సూచించారు.

డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సామాజిక స్పృహను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News