కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్
కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్
Biksham
స్థానికం ప్రతినిధి
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో 34వ వార్డులో రాజకీయ సందడి నెలకొంది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ గురువారం తన నామినేషన్ పత్రాలను మున్సిపాలిటీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈ సందర్భంగా షేక్ జహీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇప్పటికే అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా అందజేస్తామని తెలిపారు. 34వ వార్డు సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని షేక్ జహీర్కు మద్దతు పలికారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి