Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:07 PM

కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్

కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్

కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్
29-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో 34వ వార్డులో రాజకీయ సందడి నెలకొంది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ గురువారం తన నామినేషన్ పత్రాలను మున్సిపాలిటీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈ సందర్భంగా షేక్ జహీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా అందజేస్తామని తెలిపారు. 34వ వార్డు సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని షేక్ జహీర్‌కు మద్దతు పలికారు.

Sthanikam

కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్

Article Image


స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో 34వ వార్డులో రాజకీయ సందడి నెలకొంది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ గురువారం తన నామినేషన్ పత్రాలను మున్సిపాలిటీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈ సందర్భంగా షేక్ జహీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా అందజేస్తామని తెలిపారు. 34వ వార్డు సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని షేక్ జహీర్‌కు మద్దతు పలికారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News