PRINT TIME: July 10, 2026 11:13 PM
కోటపాడు శివాలయంలో నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా ధాన్యాభిషేకం
కోటపాడు శివాలయంలో నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా ధాన్యాభిషేకం
February 13, 2026 08:15 PM
112 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు శివాలయ ప్రాంగణంలో శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా నూతన శివపార్వతుల మరియు వినాయకుని విగ్రహాలకు ధాన్యాభిషేక కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు, పెటేటి గణేష్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు డొంకిన సత్యనారాయణ లీలారాధా దంపతులు, జుజ్జువరపు సత్యనారాయణ ఉదయకుమారి దంపతులు పలువురు భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా శాస్త్రోక్తంగా విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, శయ్యాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి