PRINT TIME: March 21, 2026 05:17 PM
కొర్లపాడులో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దైద రవీందర్
కొర్లపాడులో రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దైద రవీందర్
March 21, 2026 02:59 PM
7 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
కేతేపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఈద్గా వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఈద్ ముబారక్ తెలియజేశారు.
అల్లా దయతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎం.డి. యూసుఫ్ జానీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, కొర్లపాడు మాజీ సర్పంచ్ కుమ్మరి నాగయ్య, సీనియర్ నాయకులు బయ్యా అంజయ్య యాదవ్, చిలుకూరు అంజయ్యతో పాటు నాదం, జానీ, సుదర్శన్, నరేష్, కళ్యాణ్, రాజశేఖర్, గిరి, సాయి, మహేష్, సతీష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి