Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

కొమరయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలి – మంత్రి పిలుపు

కొమరయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలి – మంత్రి పిలుపు

కొమరయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలి – మంత్రి పిలుపు
April 03, 2026 03:17 PM 176 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరవీరుడు దొడ్డి కొమరయ్య పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రైతుల హక్కుల కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన ధైర్యసాహసాలు, పోరాటస్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.మంత్రి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమరయ్య చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను సాకారం చేయడం ద్వారానే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజాసేవలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ ఉద్యమానికి నాంది పలికిన గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. రైతాంగ గళంగా నిలిచిన ఆయన జీవితం యువతకు ప్రేరణనిచ్చేదిగా ఉందని చెప్పారు. సమాజంలో సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం విలువలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు కూన వనిత, సుమలత శ్రీకాంత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీశ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం మల్లయ్య, జనరల్ సెక్రటరీ తాటిపల్లి పాండు, బీసీ సంఘం యువ అధ్యక్షుడు రమేష్ కుమార్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News