ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం యం. వెంకటాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న గిడ్డంగుల సంస్థ కోల్డ్ స్టోరేజ్ పనులను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పరిశీలించారు.
నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్తో చర్చించి, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సూచించారు. కాంక్రీట్ పనులకు అవసరమైన విధంగా వాటర్ క్యూరింగ్ తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు.
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. గడువులోపు పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి