PRINT TIME: March 21, 2026 05:23 PM
కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు
కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు
March 21, 2026 02:43 PM
34 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో నీటి కొరత తీవ్రంగా మారింది. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పాటు బోర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక రైతు బుంగ బిక్షం మాట్లాడుతూ, సాగునీరు అందక పంటలు నష్టపోతున్నాయని, పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక బిక్కేరు వాగులో జరుగుతున్న అధిక ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోయి, నీటి ఊటలు క్షీణించాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సాగునీరు మాత్రమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారుతోందని తెలిపారు.
అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవడంతో పాటు, సాగు మరియు తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి