Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:38 PM

కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు

కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు

కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు
March 21, 2026 02:43 PM 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో నీటి కొరత తీవ్రంగా మారింది. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పాటు బోర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక రైతు బుంగ బిక్షం మాట్లాడుతూ, సాగునీరు అందక పంటలు నష్టపోతున్నాయని, పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక బిక్కేరు వాగులో జరుగుతున్న అధిక ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోయి, నీటి ఊటలు క్షీణించాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సాగునీరు మాత్రమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారుతోందని తెలిపారు.

అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవడంతో పాటు, సాగు మరియు తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News