Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:59 AM

కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు

కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు

కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు
21-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో నీటి కొరత తీవ్రంగా మారింది. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పాటు బోర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక రైతు బుంగ బిక్షం మాట్లాడుతూ, సాగునీరు అందక పంటలు నష్టపోతున్నాయని, పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక బిక్కేరు వాగులో జరుగుతున్న అధిక ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోయి, నీటి ఊటలు క్షీణించాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సాగునీరు మాత్రమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారుతోందని తెలిపారు.

అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవడంతో పాటు, సాగు మరియు తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.

Sthanikam

కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు

Article Image

మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో నీటి కొరత తీవ్రంగా మారింది. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పాటు బోర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక రైతు బుంగ బిక్షం మాట్లాడుతూ, సాగునీరు అందక పంటలు నష్టపోతున్నాయని, పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక బిక్కేరు వాగులో జరుగుతున్న అధిక ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోయి, నీటి ఊటలు క్షీణించాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సాగునీరు మాత్రమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారుతోందని తెలిపారు.

అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవడంతో పాటు, సాగు మరియు తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News